రాష్ట్రీయం

బాబు, జగన్‌ను జనం నమ్మడం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 16: ఏపీ ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబును వ్యతిరేకిస్తున్నారని, అదే సమయంలో జగన్‌ను సైతం నమ్మడం లేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అభిప్రాయపడ్డారు. అవినీతి రహితంగా పాలించడమే లక్ష్యంగా ప్రజాశాంతి పార్టీ ముందుకు సాగుతోందని అన్నారు. బుధవారం సోమాజీగూడలోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. మార్చిలో పెను మార్పులు జరగబోతున్నాయని, ఏప్రిల్‌లో సునామీ రాబోతుందని జోస్యం చెప్పారు. ప్రజాశాంతి పారీ పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు త్వరలో 50 వేల మంది కౌన్సిలర్లతో సమావేశం కానున్నట్టు చెప్పారు. తాను సీఎం అయిన తరువాత కేసీఆర్‌తో కలిసి పనిచేస్తానని తెలిపారు. తన వెనుక ఎవరూ లేరని, దేవుడే నన్ను నడిపిస్తున్నారని చెప్పుకొచ్చారు. జాతీయ స్థాయిలో సెక్యులర్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని, ఇప్పటికే వివిధ రాష్ట్రాలకు చెందిన నేతలతో చర్చించినట్టు చెప్పారు. కాగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కేసీఆర్ మద్దతు తీసుకుంటే వైసీపీ భూస్థాపితం కావడం ఖాయమని కేఏ పాల్ అన్నారు.