రాష్ట్రీయం

బాబుతో మాట్లాడాకే భవిష్యత్ కార్యాచరణ: మేడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంపేట, జనవరి 20 : టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబును కలిసిన తర్వాతే తన భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని విప్ మేడా వెంకట మల్లికార్జునరెడ్డి స్పష్టం చేశారు. విప్ మేడా ఆదివారం కడప జిల్లా రాజంపేట పట్టణంలోని తన నివాసంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ తాను పార్టీ మారతానంటూ వస్తున్న ఆరోపణలు, మంత్రి ఆదినారాయణరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసులురెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో స్పందించారు. జిల్లా టీడీపీ నేతలు తనపై పార్టీ అధినేత చంద్రబాబుకి పచ్చి అబద్ధాలు చెబుతున్నారన్నారు. రాజంపేటలో మంత్రి, జిల్లా అధ్యక్షుడు మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు తనకెలాంటి సమాచారం లేదన్నారు. టీడీపీకి వ్యతిరేకంగా పని చేసిన వారితో కలిసి వారు సమావేశం నిర్వహించారని విమర్శించారు. తనపై పార్టీలోని కొందరు నాయకులు కుట్రలు చేస్తున్నారని తెలిపారు. ‘ప్రజలే దేవుళ్లు.. సమాజమే దేవాలయం’ అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో ప్రజాసేవకు కట్టుబడి పని చేశానన్నారు. ఇక ఈ నెల 17వ తేదీ సీఎం చంద్రబాబును కలవాలని ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేసుకున్నానని, అయితే తమ బంధువులకు అనారోగ్యం కారణంగా వెళ్లలేకపోయానన్నారు. పార్టీ సభ్యత్వాలు తక్కువగా చేయడానికి పార్టీ కార్యకర్తలు ఆర్థికంగా బలంగా లేకపోవడమే కారణమన్నారు. జమ్మలమడుగులో మంత్రి ఆది కంటే రాజంపేటలో తానే అత్యధికంగా పార్టీ సభ్యత్వాలు చేయించానన్నారు.