రాష్ట్రీయం

మహాశివరాత్రి వేడుకలకు మల్లన్న క్షేత్రం ముస్తాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేములవాడ, జనవరి 22: ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలా..్భక్తులు తన్మయత్వం పొందేలా ..శ్రీ రాజరాజేశ్వరస్వామి క్షేత్రంలో మహాశివరాత్రి వేడకలను ఘనంగా నిర్వహిస్తామని ఎమ్మెల్యే రమేశ్‌బాబు చెప్పారు. మూడురోజలు పాటు జరిగే ఈ ఆధ్యాత్మిక పండగకు సుదూర ప్రాంతాల నుంచి క్షేత్రానికి వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా తగిన వసతి సౌకర్యాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. మంగళవారం కళాభవన్లో పద్దెనిమిది శాఖ అధికారులతో కలెక్టర్ వెంకట్రామిరెడ్డి అధ్యక్షతన జరిగిన జాతర సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే రమేశ్‌బాబు అన్నారు. ఇరుకుగా ఉన్న వేములవాడ పట్టణ రహదారులను విస్తరించడానికి ప్రజలకు సహకరించాలని కోరారు. ప్రధాన రహదారిని 80్ఫట్ల మేర విస్తరించడానికి ప్రణాళికలు సిద్దం చేశామన్నారు. మహాశివరాత్రి వరకు నూతన బ్రిడ్జిని ప్రజలకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు.