రాష్ట్రీయం

టీటీడీలో అడుగడుగునా అక్రమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: అక్రమాలను అరికట్టి తిరుమల వేంకటేశ్వరస్వామిని కాపాడాలని ఏపీ, తెలంగాణ బీజేపీ నేతలు మంగళవారం నాడు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను కోరారు. కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యయుడు డాక్టర్ కే లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే జీ కిషన్‌రెడ్డి, మాజీ డీజీపీ వీ దినేష్‌రెడ్డి, మాజీ ఐఎఎస్ దాసరి శ్రీనివాస్, మాజీ ఆర్‌టీఐ కమిషనర్ విజయబాబు, రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు చల్లపల్లి నర్సింహారెడ్డి, జాతీయ యువకేంద్రం వైస్ ఛైర్మన్ ఎస్ విష్ణువర్థన్‌రెడ్డి, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు జీ భాను ప్రకాష్‌రెడ్డి గవర్నర్‌ను కలిసి ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. అత్యంత అరుదైన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం లో పెద్ద ఎత్తున హిందువులు వచ్చి వేంకటేశ్వరస్వామిని కొలుస్తున్నారని ఎంతో భక్తి ప్రపత్తులతో వచ్చి బ్రహ్మాండనాయకుడ్ని పూజిస్తారని, దీంతో మధ్య దళారీలు ఎక్కువయ్యారని, బ్రోకర్లు పెరుగుతున్నారని గవర్నర్ దృష్టికి తెచ్చారు.
జేఈఓ కార్యాలయంలోని సిబ్బంది సీఎం కార్యాలయ సిబ్బందితో లలాచీపడుతున్నారని అత్యంత విశ్వసనీయంగా తెలుస్తోందని అన్నారు. అవినీతి, అక్రమాలకు జేఈఈ సిబ్బంది పాల్పడుతున్నారని, దర్శన టిక్కెట్లు అత్యధిక ధరలకు విక్రయిస్తున్నారని , అలాంటి సంఘటన ఒకటి గత ఏడాది సెప్టెంబర్ 27న ఉదయం 7.30కి జరిగిందని, ఎల్-1,ఎల్-2, ఎల్-3 వీఐపీ బ్రేక్ దర్శన్‌లో తనిఖీలు నిర్వహిస్తున్నపుడు చాలా మంది సీఎం కార్యాలయం నుండి రికమెంటేషన్ లేఖలు తెచ్చుకున్నారని చెప్పారు. అవి ఒకొక్కటీ 10వేల నుండి 20వేల రూపాయిల వరకూ అమ్ముకున్నట్టు తేలిందని తెలిపారు.
అభిషేకం టిక్కెట్లను కూడా రెండు లక్షల రూపాయిల మొత్తానికి అమ్ముతున్నారని తమ దృష్టికి వచ్చిందని వివరించారు. ఈ మొత్తం వ్యవహారంపై ఒక నివేదిక రూపొందించారని, అయితే ఈ నివేదిక నేటికీ వెలుగుచూడలేదని చెప్పారు. దళారీ వ్యవస్థను ఇటు జేఈఓ కార్యాలయం , ఆంధ్రప్రదేశ్ సీఎం కార్యాలయం పెంచి పోషిస్తోందని ఆరోపించారు. ఈ పరిస్థితిలో గవర్నర్ నేరుగా జోక్యం చేసుకుని అక్రమాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని బీజేపీ నేతలు కోరారు. తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయ పవిత్రతను కాపాడాలని అన్నారు.
చిత్రం..గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన తరువాత మంగళవారం రాజ్‌భవన్ ఎదుట మీడియాతో మాట్లాడుతున్న
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. పార్టీ నేతలు దత్తాత్రేయ, దినేష్ రెడ్డి, కిషన్‌రెడ్డి ఉన్నారు