రాష్ట్రీయం

రైల్వే ట్రాక్ మధ్య ఇరుక్కున్న లారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటాచలం, మార్చి 31 : నెల్లూరు జిల్లా వెంకటాచలం రైల్వే గేటు వద్ద గురువారం రైలు పట్టాలు మధ్య ట్రాలీ లారీ ఇరుక్కోవటంతో సుమారు గంటపాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గురువారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో కృష్ణపట్నం పోర్టు నుండి నెల్లూరు వైపుకు వెళ్తున్న ట్రాలీ లారీ వెంకటాచలం రైల్వే గేటు వద్ద రైలు పట్టాలు దాటుతోంది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనబోయి అదుపు తప్పి పక్కకు ఒరిగింది. దీంతో పట్టాలు పక్కన ఉన్న కంకరలో ట్రాలీ టైర్లు ఇరుక్కుపోయాయి. లారీని బయటకు తీసే సమయంలో పట్టాలు కూడా పక్కకు ఒరిగాయి. ఈ విషయం తెలుసుకున్న రైల్వే అధికారి కార్తీక్ తన సిబ్బందితో హుటహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ట్రాక్టర్ సహయంతో ట్రాలీ లారీని బయటకు తీశారు. దీంతో నెల్లూరు నుండి గూడూరు వైపు, గూడూరు నుండి నెల్లూరు వైపునకు వెళ్లే నాలుగు గూడ్సు రైళ్లతోపాటు కొమ్మలపూడి వద్ద కృష్ణ ఎక్స్‌ప్రెక్స్ ఆపేశారు. గేటు వద్ద మరమ్మతుల కారణంగా గంటకు పైగా గేటు వేయడంతో ఇరువైపులు వాహనాలు నిలిచిపోయాయి. ట్రాలీని పట్టాల మీద నుండి తీసిన తరువాత రైలు పట్టాలను రైల్వే సిబ్బంది సరిచేసి రైలు రాకపోకలు పునరుద్ధరించారు.

చిత్రం వెంకటాచలం వద్ద పట్టాలపై ఇరుక్కుపోయిన లారీ