రాష్ట్రీయం

ఏపి ఎన్నికల కమిషనర్‌గా రమేష్‌కుమార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 1: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌కు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన డాక్టర్ ఎన్ రమేష్‌కుమార్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎస్‌పి టక్కర్, సీనియర్ ఐఎఎస్ అధికారులు డాక్టర్ కె ఎస్ జవహర్‌రెడ్డి, ఎల్వీ సుబ్రహ్మణ్యం, హర్‌ప్రీత్ సింగ్, అజయ్ మిశ్రా, ఎం బాలసుబ్రహ్మణ్యం తదితరులు హాజరయ్యారు. రాష్టప్రునర్విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమారే. శుక్రవారం నాడు ఆయన వివిధ విభాగాలను సందర్శించి కమిషన్ పనితీరును పరిశీలించారు. అనంతరం రమేష్‌కుమార్ రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను కలిశారు.

చిత్రం ఏపి ఎన్నికల కమిషనర్‌గా శుక్రవారం
పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న రమేష్‌కుమార్