రాష్ట్రీయం
మరో 5 లోక్సభ స్థానాలకు జనసేన కమిటీల నియామకం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 12 February 2019
హైదరాబాద్, ఫిబ్రవరి 11: రానున్న లోక్సభ ఎన్నికలకు తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తున్న జనసేన అధినేత పవన్కళ్యాణ్ మరో ఐదు లోక్సభ స్థానాలకు ప్రత్యేక కమిటీలను నియమించారు. ఇప్పటికే ఏడు లోక్సభ స్థానాలకు కమిటీలను ప్రకటించారు. తాజాగా చేవెళ్ల, నిజామాబాద్, మహబూబాబాద్, పెద్దపల్లి, జహీరాబాద్లకు ఈ కమిటీలను ప్రకటించారు. ప్రతి కమిటీలో 11 మంది ఎగ్జిక్యూటివ్ సభ్యులు, మరో 32 మంది చొప్పున వర్కింగ్ కమిటీ సభ్యులు ఉంటారు. సోమవారం నాటి సమావేశంలో జనసేన నేతలు ఎన్ శంకర్ గౌడ్, రామ్ తాళ్లూరి తదితరులు పాల్గొన్నారు.