రాష్ట్రీయం

ప్రాజెక్టుల సందర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పదిహేనవ ఆర్థిక కమిషన్ చైర్మన్ సోమవారం హైదరాబాద్ వస్తుండగా, ఈ కమిషన్ అధికారులు మాత్రం ఆదివారమే హైదరాబాద్ వచ్చారు. ఆర్థిక కమిషన్ సభ్యుడు అశోక్ లహరి కూడా హైదరాబాద్ వచ్చిన వారిలో ఉన్నారు. ఆర్థిక కమిషన్ కార్యదర్శి అరవింద్ మెహతా, జాయింట్ సెక్రటరీ డాక్టర్ రవి కోటా, ఇరత అధికారులు ఆంటోనీ సిరియాక్, కందర్ప్ వి. పాటిల్, రీటా లహరి తదితరులు హైదరాబాద్‌కు చేరిన ఉన్నతాధికారుల బృందంలో ఉన్నారు. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరిన బృందానికి ప్రభుత్వ సలహాదారు జి.ఆర్. రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌కే జోషి, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారెడ్డి తదితరులు స్వాగతం పలికారు. హైదరాబాద్ చేరిన అధికారుల బృందం ఆదివారమే కాళేశ్వరం ప్రాజెక్టు వెళ్లి పనులను పరిశీలించింది. మేడిగడ్డ బ్యారేజ్, సిరిసిల్లలోని మిషన్ భగీరథ పనులను పరిశీలించింది. అధికారుల బృందం సోమవారం నుండి ఆర్థిక కమిషన్ చైర్మన్, సభ్యులకు వారు పాల్గొనే సమావేశాల్లో సహాయంగా ఉంటారు.

చిత్రం.. శంషాబాద్ విమానాశ్రయంలో కేంద్ర ఆర్థిక సంఘం అధికారులకు
స్వాగతం పలుకుతున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషి