రాష్ట్రీయం

ప్రాంతీయ పార్టీలను నమ్మొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప సిటీ, ఫిబ్రవరి 21: ప్రాంతీయ పార్టీల డాంబికాలు నమ్మవద్దని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ తోనే హోదా సాధ్యమన్నారు. హోదా భరోసా బస్సు యాత్ర గురువారం కడప నగరానికి చేరుకుంది. ఈ సందర్భంగా పాత కలెక్టరేట్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో రఘవీరారెడ్డి మాట్లాడుతూ టీడీపీ, వైసీపీ రెండు తోడుదొంగలని, రాష్ట్భ్రావృద్ధికి అడ్డంకిగా మారాయన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తామన్న బీజేపీ తోక ముడిచిందన్నారు. 2014లో టీడీపీ రైతుల రుణమాఫీ పేరుతో అబద్దపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. రూ.87 వేల కోట్లు రుణమాఫీ కావాల్సివుండగా అనేక సాకులతో రూ.27 వేల కోట్లకు కుదించి కేవలం రూ.16 వేల కోట్లు రుణమాఫీ చేసి చేతులు దులుపుకుందన్నారు. వైసీపీ దౌర్జన్యపార్టీ అని, టీడీపీ ద్రోహులపార్టీ అని, జనసేన అయోమయపార్టీ అని, కాంగ్రెస్ సౌభాగ్యపార్టీ అని కితాబునిచ్చారు. 58 సంవత్సరాల్లో రాష్ట్భ్రావృద్ధికోసం 16 మంది ముఖ్యమంత్రులు, లక్షల కోట్ల రూపాయలు వ్యయం చేస్తే నాలుగు సంవత్సరాల్లో చంద్రబాబు లక్షన్నర కోట్ల రూపాయలు అప్పుచేసి రాష్ట్రాన్ని దివాలా తీయించారన్నారు. తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఐపీ పరిస్థితి తప్పదన్నారు. హామీల సాధన కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యవౌతుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, డ్వాక్రా సంఘాలకు రూ.2 లక్షల రుణమాఫీ, ప్రతి ఏడాది మహిళలకు నాలుగు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. ప్రత్యేక హోదాతో నిరుద్యోగ సమస్య తీరుతుందన్నారు. ఆ హోదా ఇచ్చేందుకు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. కాంగ్రెస్ అధికారం చేపట్టగానే రాహుల్‌గాంధీ ప్రధాని హోదాలో తొలి సంతకం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపైనే ఉంటుందన్నారు. కడప నగరంలో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేస్తామని, రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.

చిత్రం.. కడప నగరంలో జరిగిన సభలో ప్రసంగిస్తున్న పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి