రాష్ట్రీయం

చంద్రబాబుపై చర్యలు తీసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 21: పుల్వామా దాడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై చర్య తీసుకోవాలని ఆ రాష్ట్ర బీజేపీ నాయకుడు, రిటైర్డు ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు డిమాండ్ చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలిసి ఈ మేరకు ఆయన ఫిర్యాదు చేశారు. పుల్వామా దాడిపై చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాలని ఆయన సూచించారు. జాతీయ స్థాయి నాయకుడై ఉండి బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం మంచిది కాదన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నాయకుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం వాంఛనీయం కాదన్నారు. యావత్తూ జాతికి చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలని ఐవైఆర్ డిమాండ్ చేశారు. తమ ఫిర్యాదు పట్ల తప్పకుండా చర్యలు తీసుకుంటామని గవర్నర్ హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.

చిత్రం..గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తున్న బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు