రాష్ట్రీయం

ప్రధానిపై ఆరోపణలు తగవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తున్నప్పటికీ, ప్రధాన మంత్రి మోదీపై ఆరోపణలు చేయడం సరికాదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ప్రధానిని ఏపీ దోషిగా నిలబెట్టడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు చేయాలని కొరుతూ కన్నా నేతృత్వంలోని ఆ పార్టీ నాయకులు బృందం శనివారం రైలేశాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను కలిశారు. అనంతరం ఏపీ భవన్‌లో కన్నా విలేఖరులతో మాట్లాడుతూ విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటుపై అక్కడి ప్రజల్లో ఉన్న సెంటిమెంటును రైల్వేమంత్రికి వివరించినట్టు చెప్పారు. విశాఖపట్నంలోని వాల్తేరు డివిజన్ సమస్య రెండు దశాబ్దాలుగా సమస్య ఉందన్నారు. ప్రధాని మోదీ విశాఖకు మార్చి ఒకటో తేదీనాడు వస్తుంన్నందున, మరోసారి రైల్వేజోన్ ఏర్పాటు అంశాన్ని రైల్వేశాఖ మంత్రి వద్దకు తీసుకెళ్లినట్టు వివరించారు. ఏపీకి ప్రత్యేక రైల్వేజోన్ అంశాన్ని పరిశీలిస్తామని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ హామీ ఇచ్చారని కన్నా అన్నారు. రాష్ట్ర విభజనను దృష్టిలో ఉంచుకోని కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఏపీకి ప్రత్యేకంగా సహాయం చేస్తున్నదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చేసిన సహాయంపై ప్రజలకు తెలియకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు వాస్తవ విరుద్ధంగా బీజేపీపైనా, ప్రధానిపైనా విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లో ఓటుకునోటు కేసులో ఇరుకున్న చంద్రబాబు అమరావతికి పారిపోయి వచ్చారని మండిపడ్డారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిని వదిలేసుకోని రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశారని చంద్రబాబుపై కన్నా ధ్వజమెత్తారు. అమరావతిలో తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు నిర్మాణాల పేరుతో ఈ ఐదేళ్లు గడిపి, కేంద్ర సహాయం చేయడం లేదని మోదీపై విమర్శలు చేయడం ఎంత వరకూ సబబని నిలదీశారు. రాష్ట్ర ప్రజలు వాస్తవాలు అర్థం చేసుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. ముఖ్యంగా ఏపీలోని వౌలిక సాదుపాయాల ప్రాజెక్టుల్లో ముఖ్యమంత్రి భారీ ఎత్తున అవినీతికి పాల్డడ్డారని ఆరోపించారు. కేంద్రం నిర్మాణం చేపట్టాల్సిన పోలవరం ప్రాజెక్టును తానే నిర్మిస్తానని కాంట్రాక్టు పనుల్లో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక రైల్వేజోన్ పరిశీలన చేయాలని మాత్రమే కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో పెట్టిందని మండిపడ్డారు. విభజన సమయంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా రాష్ట్రానికి రైల్వేజోన్ ఏర్పాటు చేస్తామని అంటూ ఎందుకు చట్టంలో పెట్టలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ది లేకపోవాడం వల్లన ప్రత్యేక హోదాను చట్టంలో పెట్టలేదని ఆరోపించారు. విభజన సమయంలో వీరప్ప మొయిలీ అడ్డుకోవడం వల్లనే ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని విభజన చట్టంలో పెట్టలేదని ఆరోపించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రజలను మరోసారి మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఏపీకి ద్రోహం చేసిన కాంగ్రెస్‌తో కలిసి తెలుగుదేశం పని చేస్తున్నదని ఆరోపించారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి న్యాయం చేయాలని పార్లమెంట్‌లో కోరింది ఒక్క బీజేపీ పార్టీనేనని ఆయన గుర్తు చేశారు. కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై కేంద్రం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్సుకు కనీస సమాచారం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని మండిపడ్డారు. దుగరాజుపట్నం పోర్టు ఏర్పాటు సాంకేతికంగా సాధ్యం కాదని, రాష్ట్రంలో వేరేచోట పోర్టు నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరితే పట్టించుకోలేదని కన్నా మండిపడ్డారు. కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ను కలిసిన బీజేపీ నాయకులు బృందంలో మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వరి, ఎంపీలు కంభంపాటి హరిబాబు, గోకరాజు గంగరాజు, జీవీఎల్ నరసింహారావు, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, ఎమ్మెల్సీ మాధవ్ తదితరులు ఉన్నారు.