రాష్ట్రీయం

నల్లగొండ నుంచి ఉత్తమ్ పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూర్‌నగర్, మార్చి 18: టీపీసీసీ అధ్యక్షుడు, హుజూర్‌నగర్ ఎమ్మెల్యే నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రానున్న లోక్‌సభ ఎన్నికల్లో నల్లగొండ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. సోమవారం ఏఐసీసీ ప్రకటించిన లోక్‌సభ అభ్యర్థులలో జాబితాలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నల్లగొండ నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే హుజూర్‌నగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి ఓ ప్రకటన జారీ చేశారు. 1994లో ఢిల్లీలోని రాష్టప్రతి కార్యాలయంలో ఉద్యోగానికి రాజీనామా చేసిన తరువాత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తొలిసారి కోదాడ శాసనసభా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 1999, 2004 ఎన్నికలలో ఉత్తమ్ కోదాడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజన అనంతరం కొత్తగా ఏర్పడిన హుజూర్‌నగర్ శాసనసభా నియోజకవర్గం నుంచి 2009, 2014లో ఘన విజయం సాధించారు. 2018 డిసెంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికలలో వరుసగా మూడు సార్లు కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. ఉత్తమ్ ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు.