రాష్ట్రీయం

కార్తీక్‌పై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఆరుగురు నాయకులను కాంగ్రెస్ బహిష్కరించింది. 2014లో జరిగిన ఎన్నికల్లో చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పీ కార్తీక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆరేపల్లి మోహన్, సోయం బాపూరావును పార్టీ నుంచి బహిష్కరించారు. అలాగే ఆదిలాబాద్ జిల్లా పార్టీ
మాజీ అధ్యక్షుడు నరేష్ జాదవ్, పీసీసీ అధికార ప్రతినిధులు మనె్న కృష్ణాంక్, రమ్యారావును పార్టీ నుంచి బహిష్కరించినట్లు టీ పీసీసీ క్రమశిక్షణా సంఘం చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఎం కోదండరెడ్డి సోమవారం వెల్లడించారు. ఆరేపల్లి మోహన్, కార్తీక్‌రెడ్డి ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావుతో మంతనాలు జరిపిన సంగతి తెలిసిందే.