రాష్ట్రీయం

తెప్పలపై విహరించిన కోనేటిరాయుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మార్చి 19: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి వార్షిక తెప్పోత్సవాల్లో నాల్గవ రోజైన మంగళవారం రాత్రి కోనేటిరాయుడు శ్రీదేవి, భూదేవీ సమేతుడై పుష్కరిణిలో తెప్పలపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఉభయ దేవేరులతో కలిసి తిరువీధుల్లో ఊరేగుతూ పుష్కరిణి వద్దకు చేరుకున్న మలయప్ప స్వామివారు వివిధ రకాల పుష్పాలతో, విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై కొలువుదీరారు. భక్తుల గోవింద నామస్మరణల నడుమ, మంగళవాయిద్యాలు, వేదపండితుల వేద మంత్రోచ్ఛరణల మధ్య ఐదుసార్లు పుష్కరిణిలో తెప్పపై విహరించారు. బుధవారం స్వామివారు పుష్కరిణిలో ఏడు చుట్లు విహరించనున్నారు. ఈకార్యక్రమంలో టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, జేఈఓ శ్రీనివాస రాజు, ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, చిన్నజీయర్ స్వామి, అర్చకులు, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.