రాష్ట్రీయం

టీడీపీ నేతల్లో అయోమయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో అధినాయకత్వం వైఖరి స్పష్టం కాక తెలంగాణ టీడీపీ నేతల్లో అయోమయం చోటుచేసుకుంది. అభ్యర్థులను నిలబెడుతుందా? లేక కాంగ్రెస్‌కు మద్దత్తు ఇస్తుందా అన్న అంశంపై నేతల్లో సందిగ్ధం నెలకొంది. తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలున్నాయి. అందులే ఎక్కడెక్కడ పోటీ చేయాలి? పరిస్థితి ఏమిటి అన్నదానిపై తెలుగు దేశం అధినాయకత్వం నుంచి స్పష్టత లేదు. దీంతో రాష్ట్ర నాయకుల్లో ఆందోళన గూడుకట్టుకుంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా దెబ్బతింది. మహాకూటమిగా ఏర్పడి 13 స్థానాల్లో టీడీపీ పోటీ చేసింది. రెండు స్థానాల్లో గెలిచింది. ఓడినప్పటికీ టీఆర్‌ఎస్ తరువాత రెండో స్థానం టీడీపీదేనని నేతలు గుర్తుచేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల శాతం పెరిగిందని నేతలు లెక్కలు చెబుతున్నారు. గెలిచిన రెండు స్థానాలూ ఖమ్మం జిల్లాలోనివే. సత్తుపల్లి నుంచి సండ్ర వెంకట వీరయ్య, అశ్వారావుపేట నుంచి మెచ్చా నాగేశ్వరావు గెలిచారు. ఇక లోక్‌సభ ఎన్నికల విషయానికి వస్తే టీడీపీ అభ్యర్థులను నిలబెడుతుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 25న నామినేషన్ల దాఖలుకు ఆఖరి తేది. అయితే నామినేషన్ గడువు ముంచుకొస్తున్నా అభ్యర్థుల విషయంలో చర్చలు జరగడం లేదని తెలుస్తోంది. గెలుపుఓటముల సంగతి ఎలా ఉన్నా...పోటీ చేయాలనుకున్న వారికి ఆశలపై నీళ్లు చల్లినట్లుగా ఉందని అంటున్నారు. పార్టీలో నిరాశ, నిస్తేజం ఉండంతో అధినాయకత్వం కూడా అంతగా చొరవ తీసుకోవడం లేదని తెలిసింది. అందుకే పోటీ చేయాలా? వద్దా అన్న విషయం బయటపెట్టడం లేదు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఎపీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. అందుకే తెలంగాణ టీడీపీ నేతలకు అపాయింట్ మెంట్ దొరకడం లేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. నల్లగొండ , భువనగిరిలో పోటీ చేయడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా ఇప్పటికే చంద్రబాబుకు లేఖలు రాశారు. దీనికి చంద్రబాబు నుంచి ఎలాంటి సమాధానం రాలేదంటున్నారు. తెలంగాణలో టీడీపీ తప్ప అన్ని పార్టీల్లోనూ ఎన్నికల సందడి కనిపిస్తోంది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, బీజేపీ అభ్యుర్థులను ప్రకటించాయి. ఒకప్పుడు నేతలు, కార్యకర్తలతో కళకళలాడే ఎన్టీఆర్ ట్రస్టు భవనం నిర్మానుష్యంగా మారింది. ఆశావాహుల హడావుడి కనిపించడమే లేదు. ఇలా ఉండగా ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్ దక్కలేదని, టీడీపీ రెండోస్థానంలో నిలిచిందని పార్టీ శ్రేణులు పేర్కొన్నారు. టీడీపీ లోక్‌సభ అభ్యర్థుల సంగతి త్వరగా తేల్చాలని నేతలు విజ్ఞప్తి చేశారు.