రాష్ట్రీయం

ఆస్తుల కోసం అన్నదమ్ములను చంపుకున్నది మీ కుటుంబమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 23: మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరగడం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కాదా? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆ రాష్ట్ర మంత్రి కళా వెంకట్రావును ప్రశ్నించారు. ఆస్తుల తగాదాల కారణంగానే వివేకానంద రెడ్డి హత్య జరిగిందని కళా వెంకట్రావు చేసిన వ్యాఖ్యలను బొత్స సత్యనారాయణ శనివారం విలేఖరుల సమావేశంలో తీవ్రంగా ఖండించారు. ఆస్తుల కోసం కళా వెంకట్రావు అన్నదమ్ములను చంపుకున్నది వాస్తవం కాదా? అని ఆయన ప్రశ్నించారు. టీడీపీ అధికారం చేపట్టిన తర్వాత చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు చెప్పి ఓట్లు అడుక్కోవాలే తప్ప ఇలా అవాకులు-చవాకులు పేలడం మంచిదని కాదన్నారు. 2009 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కోరారని ఆయన గుర్తు చేశారు. ఇక జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రాజకీయ లబ్ది కోసం విమర్శలు చేశారని ఆయన అన్నారు. కులాలు, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఆంధ్రులను టీఆర్‌ఎస్ నాయకులు తిడుతుంటే వైకాపా నేతలకు పౌరుషం లేదా? అని పవన్ అన్నారని ఆయన చెప్పారు. తమకు పౌరుషం ఉంది కనానీ మీలాగ రోజుకో మాట, పూటకో మాట మాట్లాడలేమన్నారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత పవన్ కల్యాణ్ ఆయన్ను అభినందిస్తూ ప్రజల హృదయాలను దోచుకున్నారని అన్నది మీరు కాదా? అని బొత్స ప్రశ్నించారు. మీలా ఊసరవెల్లిలా, ఆనకొండలా రంగులు మార్చలేమని ఆయన తెలిపారు.