రాష్ట్రీయం

చత్తీస్‌గఢ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 21: చత్తీస్‌గఢ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని విశాఖపట్నం వాతావరణ హెచ్చరిక కేంద్రం ఆదివారం రాత్రి పేర్కొంది. అలాగే కర్ణాటక నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కూడా కొనసాగుతోందని ఈ కేంద్రం తెలియజేసింది. వీటి ప్రభావంతో కోస్తాలో పలుచోట్ల ఒక మోస్తారు, తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఈ కేంద్రం వివరించింది. రానున్న రెండు రోజుల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. మరికొన్నిచోట్ల ఆకాశం మేఘావృతమై ఉండటం, ఉరుములు,మెరుపులతో కూడిన వర్షం కురిసే సందర్భంలో ఈదురుగాలులు వీస్తాయని కేంద్రం పేర్కొంది. ఆదివారం విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో పలుచోట్ల ఒక మోస్తరు వర్షాలు కురిశాయని కేంద్రం తెలియజేసింది. విశాఖ జిల్లాలో కశింకోట, రావికమతం, నాతవరం, చింతపల్లి, కొయ్యూరు ప్రాంతాల్లో వర్షం పడిందని కేంద్రం పేర్కొంది. అలాగే తూర్పు గోదావరి జిల్లాలో రంగమ్మపేట, రాజానగరంలో భారీ వర్షాలు కురిసినట్టు కేంద్రం తెలియజేసింది. ఈ విధంగా ఉపరితల ఆవర్తనం, ఉపరితల ద్రోణి ఏర్పడినందున మరో రెండు రోజులపాటు వాతావరణం చల్లగానే ఉంటుందని, తరువాత మళ్ళీ రెండు రోజులపాటు ఎండల తీవ్రత తప్పదని పేర్కొంది.