రాష్ట్రీయం

నారాయణాద్రిలో దోపిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, ఏప్రిల్ 9: ప్రకాశం జిల్లా రాపర్ల రైల్వేస్టేషన్ సమీపంలో నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ స్లీపర్ కోచ్‌లలో శుక్రవారం రాత్రి దొంగలు దోపిడికి పాల్పడ్డారు. ఒంగోలు రైల్వే జిఆర్‌పి సిఐ వెంకటేశ్వరరావు కథనం ప్రకారం.. 15మంది దొంగలు నారాయణాద్రి ఏసి బోగీలో ఎక్కారు. రైలు రాపర్ల రైల్వేస్టేషన్ సమీపానికి రాగానే చైన్‌లాగి దోపిడీకి పాల్పడ్డారు. గమనించిన ఎస్కార్ట్ సిబ్బంది గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరపడంతో దొంగలు పరారయ్యారు. అప్పటికే వారు పలువురు మహిళలనుంచి 56 గ్రాముల విలువైన ఆభరణాలను దోచుకున్నారు. అనిత, సుజాత, స్వామి అనే ప్రయాణికులు తమ ఆభరణాలు దోపిడీకి గురైనట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దోపిడీ దొంగలు ఉత్తర్‌ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందినవారుగా అనుమానిస్తున్నట్లు సిఐ వెంకటేశ్వరరావు తెలిపారు.