రాష్ట్రీయం

పిడుగు పడి ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్ : ఉదయం నుంచి ఒక్కటే ఎండ. ఉన్నట్టుండి ఆకాశం మేఘామృతం కావడంతో పాటు గాలివాన కురిసింది. పెద్ద పెద్ద ఉరుములు ఉరిమాయి. ఒక్కసారిగా పెద్ద పిడుగుపడటంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా ధారూరు మండలం రాజాపూర్ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ధారూరు మండలం రాజాపూర్ గ్రామానికి చెందిన ఫక్రుద్దీన్ అనే రైతు పొలం పనుల నిమిత్తం అతని భార్య ఖాజాబి(38), కూతురు తబాసాము(16),కొడుకు అక్రమ్(12)లతో కలిసి పొలంలో చెత్త చెదారం ఏరి వేసి ఖరీఫ్ సీజన్‌కు సిద్దం చేసుకుంటున్నారు. ఇంతలోనే ఒక్కసారిగా వాతావరణం చల్లలబడటంతో పాటు గాలివాన కురువసాగింది. దీంతో వారు పొలం గట్టున ఉన్న చెట్టుకిందకు వెళ్ళారు. ఒక్కసారిగా ఉరుము ఉరిమి వారు నిల్చుని ఉన్న చెట్టుపై పిడుగు పడింది. దీంతో భార్య ఖాజాబి, కూతురు తబాసము, కొడుకు అక్రమ్‌లు అక్కడికక్కడే మృతి చెందారు. ఫక్రుద్దీన్ సైతం తీవ్రంగా గాయపడ్డాడు. ఇది గమనించిన గ్రామస్తులు వారి పొలం వద్దకు చేరుకుని గాయాలపాలైన ఫక్రుద్దీన్‌ను పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఫక్రుద్దీన్ పరిస్థితి విషమయంగా ఉందని వైద్యులు తెలుపుతున్నారు. సంఘటన స్థలానికి ధారూరు పోలీసులు, రెవెన్యూ అధికారులు చేరుకుని సంఘటనకు సంబంధించిన విషయాన్ని ఆరా తీశారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి.