రాష్ట్రీయం

నీతి ఆయోగ్ సమావేశం నేడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 11: హైదరాబాద్‌లోని గ్రాండ్ కాకతీయ హోటల్‌లో మంగళవారం ఉదయం పది గంటలకు నీతి ఆయోగ్ సమావేశం జరుగుతుంది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలను అధ్యయనం చేసేందుకు నీతి ఆయోగ్ ఈ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ రెండు పథకాల పట్ల దేశ వ్యాప్తంగా ఆసక్తి వ్యక్తం అవుతోంది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇంకా మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. ఈ రెండు పథకాలు తెలంగాణలో విజయవంతం అయితే ఇదే విధంగా దేశ వ్యాప్తంగా అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఇప్పటికీ నీతి ఆయోగ్ ఈ పథకాలను పరిశీలించి తమ రాష్ట్రాల్లో అమలు చేయాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాసింది.