రాష్ట్రీయం

మోదీ, జగన్‌కు కేసీఆర్ శుభాకాంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 23: పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఏన్డీయో ఘన విజయం సాధించడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఒక ప్రకటనలో అభినందలు తెలిపారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం మరింత ముందుకు పోవాలని కేసీఆర్ ఆకాంక్షించారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్భుత విజయం సాధించడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డికి ఫోన్ చేసి కేసీఆర్ అభినందలు తెలిపారు. జగన్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందడుగు వేస్తుందన్న ఆశాభావాన్ని కేసీఆర్ వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు మెరుగుతాయని కేసీఆర్ ఆకాంక్షించారు.