రాష్ట్రీయం

గవర్నర్‌ను కలిసిన సీఎం జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రారంభం సందర్భంగా శుక్రవారం ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించేందుకు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ గురువారం నగరానికి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో పలువురు అధికారులు స్వాగతం పలికారు. సాయంత్రం గవర్నర్ బస చేసిన హోటల్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసిన తదుపరి కొద్దిసేపు ఇరువురు ముఖాముఖి సంభాషించుకున్నారు. తదనంతరం ముఖ్యమంత్రి జగన్ అక్కడ నుంచి బయలుదేరి తాడేపల్లి వెళ్లారు. ఇదిలా ఉండగా గురువారం రాత్రి ఇంద్రకీలాద్రికి చేరుకుని శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్లను గవర్నర్ దర్శించుకున్నారు.

విజయవాడ విచ్చేసిన గవర్నర్ నరసింహన్‌ను కలిసిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి