రాష్ట్రీయం

తెప్పపై విహరించిన పద్మావతి అమ్మవారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 15: సిరుల తల్లి తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాల్లో నాల్గవరోజైన ఆదివారం అమ్మవారు తెప్పపై విహరించి భక్తలను కటాక్షించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, నిర్వహించారు. మధ్యాహ్నం 3.30 నుండి 5 గంటల వరకు నీరాడమండపంలో శ్రీ పద్మావతి అమ్మవారికి వేడుకగా అభిషేకం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనాలతో విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం 6.30 నుండి 7.45 గంటల వరకు తెప్పోత్సవం వైభవంగా జరిగింది. ఇందులో అమ్మవారు ఐదు చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారు రాత్రి 8.30 నుండి 9.45 గంటల వరకు గజ వాహనాన్ని అధిష్ఠించి ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగి భక్తులకు అభయమిచ్చారు. తెప్పోత్సవాల్లో ఐదవరోజైన సోమవారం శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పపై విహరించనున్నారు. తెప్పోత్సవాల సందర్భంగా ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్‌సేవలను రద్దు చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సీవిఎస్‌ఓ గోపీనాథ్‌జెట్టి, తిరుపతి స్థానిక ఆలయాల డిప్యూటీ ఈవో ఝాన్సీరాణి, ఏఈవో సుబ్రహ్మణ్యం, ఏవీఎస్‌ఓ నందీశ్వర్‌రావు, సూపరింటెండెంట్ గోపాలకృష్ణ, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.