రాష్ట్రీయం

అన్ని పాఠశాలలకూ ‘అమ్మఒడి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభించనున్న ‘అమ్మఒడి’ పథకం ప్రతి పాఠశాలకూ వర్తిస్తుంది. బడిబాట కార్యక్రమంలో అక్షరాభ్యాసం సందర్భంగా, విద్యాశాఖపై సమీక్ష సమావేశాల్లోనూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఈ పథకం అమలుపై సుదీర్ఘంగా చర్చించారు. పేద విద్యార్థులను బడికి పంపే తల్లులకు ఏటా రూ.15వేల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. ఇది కేవలం ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే వర్తిస్తుందనే ప్రచారం జరిగింది. అయితే దీనిపై ఆదివారం ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టత ఇచ్చింది. పేద విద్యార్థులు చదివేది ప్రైవేటు పాఠశాల అయినా, ప్రభుత్వ పాఠశాలైనా ప్రతి ఒక్కరికీ అమ్మఒడి పథకం వర్తిస్తుందని స్పష్టం చేసింది. అక్షరాస్యత శాతంలో వెనుకబడి ఉన్న పరిస్థితిని మెరుగుపరిచేందుకు పేదల పిల్లల్లో ప్రతిఒక్కరూ బడికి వెళ్లి చదువుకోవాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటనలో స్పష్టం చేసింది.