రాష్ట్రీయం

నడిరోడ్డుపై ఆమ్లెట్ వేసిన యువకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుల్తానాబాద్, ఏప్రిల్ 14: నిప్పుల కొలిమిగా ఎండలు మండిపోతుండడంతో.. నడిరోడ్డుపైనే యువకులు గురువారం గుడ్డుతో ఆమ్లెట్ వేశారు. ముఖ్యంగా బుధ, గురువారాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి ఉష్ణోగ్రత నమోదు పెరిగింది. ఈ దశలో కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ పాత జెండా, గాంధీనగర్‌కు చెందిన యువకులు మిట్ట మధ్యాహ్నం నడిరోడ్డుపైన పెనం పెట్టి కోడిగుడ్లతో ఆమ్లెట్ వేసుకున్నారు. ఎండలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ యువకులు ఆమ్లెట్ వేసి మరో వైపు ఎండల తీవ్రతను ప్రజలకు గుర్తు చేశారు.

చిత్రం కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్‌లో ఎర్రటి ఎండలో ఆమ్లెట్ వేస్తున్న దృశ్యం