రాష్ట్రీయం

బీజేపీలోకి నేనెందుకు వెళ్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 15: బీజేపీలోకి నేనెందుకు వెళ్తాను, అది బుర్రలేనివారు నాపై చేస్తున్న ప్రచారం అది అంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఖండించారు. సోమవారం ఉదయం విరామ సమయంలో తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ఆయనకు రంగనాయకుల మండపంలో వేదపండిపతులు వేదాశీర్వచనం చేశారు. అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల ఎంపీ రేవంత్ రెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ తాను పార్టీ మారుతానన్న ప్రచారం నమ్మవద్దన్నారు. తాను ప్రశ్నించే గొంతునని, అందుకే ప్రజలు తనను పార్లమెంట్‌కు పంపించారని చెప్పారు. తాను పార్లమెంట్‌లోలో ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తానన్నారు. ఇదిలావుండగా తెలంగాణ ఎమ్మెల్యే హరీష్ రావు సైతం ఉదయం విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు.