రాష్ట్రీయం

లక్ష్మీ బ్యారేజీలో 65 గేట్లు ఎత్తివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహదేవ్‌పూర్, ఆగస్టు 12: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మహదేవ్‌పూర్ మండలంలోని లక్ష్మీ బ్యారేజీ (మేడిగడ్డ బ్యారేజీ) 65 గేట్లను ఎత్తివేయడంతో దిగువకు రెండు లక్షల 31 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. బ్యారేజీ సామర్ధ్యం 16.17 ఉండగా ప్రస్తుత లెవల్ 93.30 మీటర్ల నీటి మట్టం ఉంది. లక్ష్మీ బ్యారేజీ వద్ద 2.645 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్టు ఇఇ రమణారెడ్డి తెలిపారు. అలాగే సరస్వతీ బ్యారేజీ (అన్నారం బ్యారేజీ) వద్ద 10.87 టీఎంసీలకు గాను 6.82 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రస్తుతం సరస్వతీ బ్యారేజీ గేట్లను మూసివేసినట్టు అధికారులు తెలిపారు. కనె్నపల్లి పంపుహౌస్ యధావిధిగానే మూసివేశారు.

చిత్రం...నీటితో నిండుకుండలా లక్ష్మీ బ్యారేజీ