రాష్ట్రీయం

పూరి జగన్నాథ్‌పై డిస్ట్రిబ్యూటర్ల దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 16: ప్రముఖ సినీ దర్శకుడు పూరి జగన్నాథ్‌పై సినీ డిస్ట్రిబ్యూటర్లు దాడికి పాల్పడ్డారు. గతంలో దర్శకుడు జగన్నాథ్ నిర్మించిన లోఫర్ చిత్రం ద్వారా తాము తీవ్రంగా నష్టపోయామని డిస్ట్రిబ్యూటర్లు అభిషేక్, ముత్యాలు, సుధీర్ శనివారం ఫిలింనగర్‌లోని పూరి జగన్నాథ్ ఇంటికి వెళ్లి దాడి చేశారు. ఈ దాడిలో దర్శకుడు పూరి చేతికి స్వల్ప గాయమైంది. రాబోయే సినిమాపై డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఇవ్వాలంటూ డిస్ట్రిబ్యూటర్లు గొడవకు దిగారు. దాదాపు గంట సేపు వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పూరి జగన్నాథ్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో డిస్ట్రిబ్యూటర్లపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.

చిత్రం పూరి జగన్నాథ్‌