రాష్ట్రీయం
కేసీఆర్, కేటీఆర్కు రాఖీ కట్టిన తోబుట్టువులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్, ఆగస్టు 15: రాఖీ పౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు ఆయన తోబుట్టువులు రాఖీలు కట్టారు. ప్రగతి భవన్కు వచ్చిన సీఎం సోదరీమణులు ఆయనకు సంప్రదాయబద్ధంగా రాఖీలు కట్టి స్వీట్ తినిపించి ఆశీర్వదించారు. అలాగే సీఎం కుమారుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుకు సోదరి, మాజీ ఎంపి కవిత, సోదరుడు రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ భార్య రోహిణి రాఖీలు కట్టి స్వీట్లు పంచి ఆశీర్వాదం తీసుకున్నారు. సంతోష్కుమార్కు కూడా కవిత, మరో సోదరి సౌమ్య రాఖీలు కట్టారు. ఈ వేడుకను తన ట్వీట్టర్లో కేటీఆర్ను పోస్ట్ చేస్తూ,‘కొన్ని బంధాలు ఎప్పటికీ ప్రత్యేకమైనవే’నని పేర్కొన్నారు.
చిత్రం...కేటీఆర్కు రాఖీ కడుతున్న సోదరి, మాజీ ఎంపీ కవిత