రాష్ట్రీయం

ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 19: ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ దాఖలు చేసిన ముగ్గురు వైకాపా అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం అయింది. శాసన మండలిలో ఖాళీ అయిన స్థానాల కోసం ఈ నెల 14న నోటిఫికేషన్‌ను జారీ చేశారు. వైకాపా అభ్యర్థులుగా మంత్రి మోపిదేవి వెంకటఠమణ, మహమ్మద్ ఇక్బాల్, చల్లా రామకృష్ణారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణకు సోమవారం చివరి రోజు కాగా, గడువు ముగిశాక పోటీలో ముగ్గురే ఉండటంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. ఎన్నికైన ముగ్గురిలో ఇక్బాల్, రామకృష్ణారెడ్డికి వెలగపూడి అసెంబ్లీ ప్రాంగణంలో శాసన మండలి కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారు.

చిత్రం...ఎమ్మెల్సీగా ఎన్నికైన అనంతరం ధ్రువపత్రాలు అందుకుంటున్న ఇక్బాల్, రామకృష్ణారెడ్డి