రాష్ట్రీయం

ఇక రేషన్ కార్డులు బియ్యానికే పరిమితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 18: రేషన్ కార్డులు ఇక ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్‌గా చౌక ధరల దుఖాణాల్లో బియ్యం తీసుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయి. ఫుడ్ సెక్యూరిటీ కార్డులు బియ్యం కోసం మాత్రమే ఉపయోగపడతాయని మిగతా పథకాలకు వర్తించదని పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరోగ్య శ్రీ, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకం వంటి వాటికి పౌర సరఫరా శాఖ నుంచి దారిద్య్ర రేఖకు దిగువ ఉన్న వారి డేటా తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీకి, ప్రభుత్వ పథకాలు అన్నింటికీ రేషన్ కార్డు ఆధారం కావడం వల్ల ఇది దుర్వినియోగం అవుతోందని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత పౌర సరఫరాల శాఖ సమీక్షలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. రాష్ట్రంలో కుటుంబాల సంఖ్య కన్నా రేషన్ కార్డుల సంఖ్య ఎక్కువగా ఉందని ముఖ్యమంత్రి పలు సందర్భాల్లో అసెంబ్లీలో చెప్పారు. ఆరోగ్య శ్రీ వంటి పథకం వల్ల అనర్హులు కూడా పెద్ద సఖ్యలో రేషన్ కార్డులు తీసుకున్నారని, బోగస్ కార్డులు పెద్ద సంఖ్యలో ఉన్నాయని ప్రభుత్వ పరిశీలనలో తేలింది. దీంతో రేషన్ కార్డును బియ్యానికి మాత్రమే పరిమితం చేయడం వల్ల దుర్వినియోగాన్ని అడ్డకోవచ్చనని ప్రభుత్వం భావిస్తోంది.