రాష్ట్రీయం

భాగ్యనగరంలో పేలుడు కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 8: పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే 279 పిల్లర్ వద్ద ఆదివారం జరిగిన కెమికల్ డబ్బా పేలుడు భాగ్యనగరంలో కలకలం రేపింది. హైదరాబాద్ నగరంలో గవర్నర్, మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం, మరోపక్క వినాయక చవితి వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో ఈ పేలుడు సంభవించడంతో పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యా రు. హైదరాబాద్ నగరంలో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. రాచకొండ, సైబరాబాద్‌తో పాటు హైదరాబాద్ సీటీ పోలీసులను ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. వివిధ ప్రధాన కుడళ్లలో వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. రాజేంద్రనగర్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసకున్న ఘటన కమికల్ డబ్బా పేలిందని తేలడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.