రాష్ట్రీయం
వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో కాటేజీ దాతలకు గదుల కేటాయింపు ఉండదు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 23 October 2019
తిరుపతి, అక్టోబర్ 22: నూతన సంవత్సరం 2020 జనవరి 1న, 6న వైకుంఠ ఏకాదశి, 7న ద్వాదశి పర్వదినాల్లో తిరుమలకు విశేషంగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న కారణంగా వారి సౌకర్యార్థం కాటేజీ దాతలకు, దాతల సిఫార్సు ఉత్తరాలకు గదుల కేటాయింపు ఉండదని టీటీడీ మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేసింది. నూతన ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా డిసెంబర్ 30, జనవరి 1 తేదీలతో పాటు 4 నుంచి 7వ తేదీ వరకు గదుల కేటాయింపు ఉండదని తెలిపింది. ఈ మేరకు కాటేజీ డోనార్ మేనేజ్మెంట్ సిస్టమ్ అప్లికేషన్లో టీటీడీ మార్పులు చేపట్టింది. దాతలు ఈవిషయాన్ని గమనించి సహకరించాలని టీటీడీ ఆ ప్రకటనలో కోరింది.