రాష్ట్రీయం

ఘనంగా కైశిక ద్వాదశి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: శ్రీవారి ఆలయంలో శనివారం సాలకట్ల కైశిక ద్వాదశి ఆస్థానం ఘనంగా జరిగింది. ఉదయం 4.30 నుంచి 5.30 గంటల వరకు శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి ఉభయనాంచారులతో కలిసి తిరుమాడ వీధుల్లో తిరిగి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం స్వామి, అమ్మవార్లను బంగారు వాకిలి చెంత వేంచేపు చేసి అర్చకులు పురాణ పఠనంతో కైశిక ద్వాదశి ఆస్థానాన్ని ఘనంగా నిర్వహించారు. పురాణాల ప్రకారం శ్రీవైష్ణవ క్షేత్రాల్లో నిర్వహించే ముఖ్యమైన పర్వదినాల్లో కైశిక ద్వాదశి ఒకటి. శ్రీ వరాహ పెరుమాళ్ కైశికపురాణంలోని 82 శ్లోకాలతో శ్రీదేవికి కథగా చెప్పిన రోజును కైశిక ఏకాదశిగా పిలుస్తారు. ఈ కథ ఆధారంగా కైశిక ద్వాదశి ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ సందర్భంగా టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ మాట్లాడుతూ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావించే శ్రీవారి ఆలయంలో కైశిక ద్వాదశిని ప్రతి సంవత్సరం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు.
ఏడాదిలో ఈ ఒక్కరోజు మాత్రమే ఉగ్రశ్రీనివాసమూర్తిని మాడ వీధుల్లో ఊరేగిస్తారని తెలిపారు. ఈ ఉత్సవ నేపథ్యంలో స్వామివారికి ప్రాతఃకాలంలో నిర్వహించే సుప్రభాతం, తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించినట్లు తెలిపారు. స్వామివారి కృపాకటాక్షాలు భక్తులందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, టీటీడీ అదనపు ఈఓ ఏ.వి.్ధర్మారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.
నంబదువాన్ కథ
కైశిక ద్వాదశి పురాణ నేపథ్యం విశేష ఘట్టాలతో కూడుకున్నది. నంబదువాన్ అనే భక్తుడు స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించడానికి వెళ్తుంతుండగా మార్గమధ్యంలో ఒక బ్రహ్మరాక్షసుడు తారసపడి తినడానికి సిద్ధపడ్డాడు. తాను ప్రస్తుతం శ్రీ హరికి సంకీర్తనార్చన చేయడానికి వెడుతున్నానని అది అవగానే తిరిగి వచ్చి నీ క్షుద్భాదను తీరుస్తానని నంబదువాన్ బ్రహ్మ రాక్షసునికి ప్రమాణం చేశాడు. ఇచ్చిన మాట ప్రకారం స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించి బ్రహ్మరాక్షసుని చెంతకు రావడంతో అతని భక్తికి సత్యనిరతికి ముగ్దుడైన స్వామివారు నంబదువాన్‌కు మోక్షం ప్రసాదించడంతో ఉత్తాన ద్వాదశికి కైశికద్వాదశి అనే పేరు వచ్చింది.

*చిత్రం... మాడ వీధుల్లో వేకువజామున ఊరేగుతున్న శ్రీ ఉగ్ర శీనివాసమూర్తి