రాష్ట్రీయం

శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారికి భక్త నీరాజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 28: ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్యదేవత, సిరుల తల్లి శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో మార్గశిర మాసోత్సవాల తొలి గురువార పూజలు విశాఖలో ఘనంగా నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వర్ణ్భారణ అలంకారాలు, కలువ పుష్పాలతో అమ్మవారిని దివ్యంగా ఆలంకరించారు. అమ్మవారికి పూజలు చేసేందుకు భక్తులు బుధవారం అర్ధరాత్రి నుంచే ఆలయ క్యూలైన్లలో వేచి ఉన్నారు. విశాఖ జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ పూజా కార్యక్రమాలను విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ ఈవో మూర్తి పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. మార్గశిర మాసంలో గురివారం పూజలకు అత్యంత ప్రాధాన్యత ఉండటం విశేషం.