రాష్ట్రీయం

పాలేరు అభ్యర్థిగా మంత్రి తుమ్మల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 20: ఖమ్మం జిల్లా పాలేరు ఉపఎన్నికల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థిగా మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావును ముఖ్యమంత్రి కెసిఆర్ ఎంపిక చేశారు. అలాగే ఎన్నికల ఇంచార్జిగా మంత్రి కెటిఆర్‌ను నియమించినట్టు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గత నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ముఖ్యమంత్రి కెసిఆర్ ఫామ్‌హౌస్ నుంచి బుధవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు.
పార్టీ ముఖ్యులు, మంత్రులతో సమావేశమైన ముఖ్యమంత్రి పాలేరు ఉప ఎన్నికకు అభ్యర్థి ఎంపికపై చర్చించారు. తుమ్మలను అభ్యర్థిగా బరిలోకి దింపితే సునాయసంగా విజయం సాధించే అవకాశం ఉందన్న అభిప్రాయం పలువురు వ్యక్తం చేయడంతో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి తుమ్మలకు తెలియజేయగా పార్టీ ఆదేశానుసారం నడుచుకుంటానని స్పష్టం చేసినట్టు పేర్కొన్నారు.