రాష్ట్రీయం

కృష్ణలో మునిగి నలుగురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఏప్రిల్ 22: కృష్ణా జిల్లా కోడూరు మండలం విశ్వనాథపల్లి అమ్మవారి నెల సంబరానికి వచ్చిన నలుగురు యువకులు కృష్ణానదిలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తూ నీట మునిగి మృతి చెందారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్ధపల్లి గ్రామానికి చెందిన మైలా జయకృష్ణ(19), ఆరుగుల శ్రీకాంత్(18), మట్టుపల్లి పవన్ కుమార్(16), తలుచూరి నాగరాజు(15) ఈ ఘటనలో మృతి చెందారు. శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో విశ్వనాథపల్లి వచ్చిన వీరంతా స్నానం చేసేందుకు కృష్ణానదిలోకి దిగారు. అక్కడ లోతుగా ఉండటంతో దిగిన కొద్దిసేపటికే నలుగురు యువకులు గల్లంతయ్యారు. ఇది గమనించిన స్థానిక జాలర్లు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం కోసం అవనిగడ్డ తరలించే ప్రయత్నం చేయగా బంధువులు అడ్డుకున్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారుల వైఫల్యం వల్లనే తమ పిల్లలు మృతి చెందారని వారు ఆందోళనకు దిగారు. ఆర్డీవో సాయిబాబు జోక్యంతో మృతదేహాలను అవనిగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.