రాష్ట్రీయం

ప్రశాంతంగా కానిస్టేబుళ్ల రాత పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 24: కానిస్టేబుల్ ఉద్యోగ నియామకానికి ఆదివారం జరిగిన రాత పరీక్ష ప్రశాంతంగా జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 1131 కేంద్రాల్లో 492855 మంది అభ్యర్థులు పరీక్ష రాశారని తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ జె పూర్ణచంద్రరావు తెలిపారు. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 5.36 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 535298 మంది అభ్యర్థులకు హాల్ టికెట్లు జారీ చేశామని, వీరిలో 492855 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా 42443 మంది అభ్యర్థులు పరీక్షకు గైర్హాజరయ్యారని పూర్ణచంద్ర రావు తెలిపారు. మొత్తం 92.07 శాతం అభ్యర్థులు పరీక్ష రాశారని పేర్కొన్నారు. ఇదిలావుండగా పరీక్షకు ముందు సెట్ కోడ్‌ను తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అనురాగ్ శర్మ ఆవిష్కరించారు.