రాష్ట్రీయం
అనుకున్న గ్రేడ్ రాలేదని విద్యార్థిని ఆత్మహత్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 11 May 2016
కె.డి.పేట, మే 10: పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో గ్రేడ్ తక్కువగా వచ్చిందని కలతచెందిన ఓ విద్యార్థిని ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా కె.డి.పేట మండలం ఎఎల్.పురంలో మంగళవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. తల్లిదండ్రులు లేని లావణ్య(16) తన మేనమామ వద్ద ఉంటూ స్థానిక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది. చదువులో ముందుండే లావణ్య పరీక్షలు బాగా రాసింది. 9.5 గ్రేడ్ వస్తుందని భావిస్తుండగా మంగళవారం విడుదలైన ఫలితాల్లో 6.8 రావడంతో కంగుతింది. ఊహించిన దానికంటే తక్కువ గ్రేడ్ రావడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని లావణ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.