రాష్ట్రీయం

నేడు, రేపు భారీ వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 14: నైరుతి బంగాళాఖాతం అనుకుని హిందూ మహాసముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు శనివారం రాత్రి తెలిపారు. ఇది రాగల 48 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు చోట్ల చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిన తర్వాత తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్రలో ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇదిలాఉండగా అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే కోస్తాంధ్రలోని పలు చోట్ల శనివారం వాతావరణం చల్లబడింది. తేలిపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. తీవ్రమైన ఎండలతో సతమతమైన ప్రజానీకం చిరుజల్లులతో సేదదీరింది.