రాష్ట్రీయం

‘జామ్’లో ఏపి నెంబర్ వన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 14: జన్ ధన్ యోజన, ఆధార్, మొబైల్ యాప్ ట్రాన్జాన్షన్స్ (జామ్)ను అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి స్థానంలో ఉందని ఆధార్ డైరెక్టర్ జనరల్ అజయ్ భూషణ్ పాండే తెలియచేశారు. అజయ్ భూషణ్‌తోపాటు ప్రధాన మంత్రి ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్, కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు తదితరులు జిల్లాలో ఆధార్, జన్ ధన్ యోజన, మొబైల్ యాప్ ట్రాన్జాక్షన్స్ అమలు జరుగుతున్న తీరును శనివారం స్వయంగా పరిశీలించారు. ఆ తరువాత ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, కేంద్రం ప్రకటించిన పథకాలను త్వరితగతిన అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి స్థానంలో ఉందన్నారు. 2015లో దేశవ్యాప్తంగా 80 శాతం ఆధార్ కార్డులు జారీ అయితే, ఆంధ్రప్రదేశ్‌లో 96 శాతం పూర్తి చేయడం ముదావహమన్నారు.

చిత్రం విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతున్న భూషణ్ పాండే, సుబ్రమణియన్