రాష్ట్రీయం

టిడిపి మహానాడు పనులకు మంత్రి బొజ్జల భూమిపూజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 16: తిరుపతిలోని నెహ్రూ మునిసిపల్ క్రీడా మైదానంలో ఈనెల 27నుంచి 3రోజుల పాటు నిర్వహించనున్న టిడిపి మహానాడు సభ ఏర్పాట్లకు సోమవారం ఆంధ్రప్రదేశ్ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి భూమిపూజ చేశారు. పనులు ప్రారంభించడం కోసం వాస్తు ప్రకారం ఈశాన్య మూలన ముందుగా మంత్రి పూజలు నిర్వహించారు. ఇది తమ ఇంటి పండుగగా భావించి ఎవరికి వారు స్వచ్ఛందంగా మహానాడు కార్యక్రమానికి సంబంధించిన పనులను చేపట్టడానికి సన్నద్ధమవుతున్నారన్నారు. ఈ మహానాడు కార్యక్రమాల నిర్వహణ పూర్తిగా పార్టీ నిధులతో చేపడుతున్నామని, ఎక్కడా ప్రభుత్వ పరంగా సహకారం తీసుకోవడం లేదని మంత్రి స్పష్టం చేశారు.
chitram తిరుపతిలో టిడిపి మహానాడు సభ ఏర్పాట్లకు సోమవారం భూమిపూజ చేస్తున్న ఏపి మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి