ఆంధ్రప్రదేశ్‌

యానాంలో భారీగా పోలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యానాం, మే 16: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్ఛేరిలోని యానాం నియోజకవర్గంలో సాధారణ ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. నియోజకవర్గంలో 93.01 శాతం పోలింగ్ నమోదయ్యింది. ఉదయం పోలింగ్ ప్రారంభం కాగానే కాంగ్రెస్ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు అగ్రహారం బూత్‌లో ఓటుహక్కు వినియోగించుకున్నారు. అలాగే ఎన్‌ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి తిరుకోటి భైరవస్వామి ఎన్‌వివి బాయ్స్ హైస్కూలులో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్‌లో ఓటుహక్కు వినియోగించుకున్నారు. అన్నా డిఎంకె అభ్యర్థి మంచాల సత్యసాయికుమార్ ఎన్‌వివి బాయ్స్ హైస్కూల్‌లో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్‌లో, బిజెపి అభ్యర్ధి కనకాల రామదాసు పైడికొండల వీధిలో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.