రాష్ట్రీయం

ఆధునిక వ్యవసాయంతో అభివృద్ధి: తుమ్మల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మే 21: పాలేరు నియోజకవర్గంలో తిరుమలాయపాలెం మండలాన్ని ఆధునిక వ్యవసాయంతో అభివృద్ధి బాట పట్టిస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనబెట్టి పాలేరు నియోజకవర్గం అభివృద్ధి కోసం ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటానని స్పష్టం చేశారు. భక్తరామదాసు పథకం పూర్తయితే నియోజకవర్గంలోని నీటి సమస్య పరిష్కారం అవుతుందన్నారు. పాలేరు నియోజకవర్గాన్ని అన్ని నియోజకవర్గాలకు ఆదర్శంగా ఉండేలా అభివృద్ధి చేస్తానన్నారు. కరవు ప్రాంతమైన పాలేరు ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు తాను శాయశక్తులా కృషి చేస్తానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను అర్హులందరికీ చేర్చేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. పార్టీలకతీతంగా పాలేరు నియోజకవర్గ ప్రజలు తనకు ఓట్లు వేసి గెలిపించారని, వారి సమస్యలను పరిష్కరించి రుణం తీర్చుకుంటానన్నారు.