ఆంధ్రప్రదేశ్‌

ఎవరికీ భయపడను..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 27:కడప జిల్లాలో హింసలేదు. అంతా వై ఎస్ జగన్మోన్ రెడ్డి, ఆయన కుటుంబంలోనే ఉంది. హింసతో భయపెట్టాలని చూస్తున్నారు. ఇలాంటి వారిని ఎందరినో చూశాను. నేను భయపడే ప్రసక్తేలేదు. ప్రజల కోసం నా ప్రాణాలను అడ్డుపెడతా’నని సిఎం చద్రబాబు నాయుడు అన్నారు. తిరుపతిలో జరుగుతున్న టిడిపి మహానాడు సభలో కార్యకర్తలను చైతన్య పరిచేలా ప్రసగించిన చంద్రబాబు ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్‌పై విరుచుకుపడ్డారు. కాపుల ఉద్యమం హింసాత్మకంగా మారడానికి కారణం జగన్మోహన్‌రెడ్డే అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాపులకు ఇచ్చిన హామీలను అప్పటి సిఎం వై ఎస్ రాజశేఖర్ రెడ్డి అమలు చేయలేదన్నారు. కాపులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పినా వినకుండా ఉభయ గోదావరి జిల్లాల ప్రజలనే కాకుండా రాష్ట్ర ప్రజలను తీవ్ర భయాందోలనలకు గురిచేశారని అన్నారు. రైళ్ళను దగ్ధం చేశారని తెలిపారు. పరిటాల రవిని దారణంగా హత్య చేసిన తరువాత వై ఎస్‌ను నిలదీసింది తానేని, ఇది ప్రభుత్వ హత్యగా తాను అసెంబ్లీలో నిలదీసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజల కోసం తన ప్రాణాలను అడ్డుపెట్టడానికైనా తాను సిద్ధమే అన్నారు.