రాష్ట్రీయం

పాముకాటుతో తల్లి.. పాలు తాగి కొడుకు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుత్తి, జూన్ 2: పాముకాటుకు గురైన తల్లితో పాటు ఆమె పాలు తాగిన ఏడాది కొడుకు మృతి చెందిన సంఘటన గురువారం అనంతపురం జిల్లా గుత్తి మండల పరిధిలోని గాంధీనగర్ గ్రామంలో చోటుచేసుకుంది. మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గాంధీనగర్‌కు చెందిన లింగన్న, చంద్రకళ (30) దంపతులు పశుపోషణ ద్వారా జీవనం సాగించేవారు. వారికి ఏడాది వయసు గల కుమారుడు ఉన్నారు. గురువారం తెల్లవారుజామున చంద్రకళ పశువులపాకలో పాలు పితుకుతుండగా పాము కాటు వేసింది. అయితే ఆ విషయాన్ని ఆమె గుర్తించలేకపోయింది. తన కుమారుడు ఉదయం 7 గంటలకు నిద్ర లేవగా ఆ బాలుడికి పాలు పట్టించింది. దీంతో తల్లీకొడుకుల శరీరంలోకి విషం ఎక్కడంతో బాలుడు పసుపు వర్ణంలోకి మారగా, చంద్రకళ కూడా తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో వారిద్దరినీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు.