రాష్ట్రీయం

తిరుమలలో ప్రయోగాత్మకంగా ప్రహరీ ఉద్యానవనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, జూన్ 2: తిరుమల శ్రీవారి ఆలయం వద్ద గురువారం ప్రయోగాత్మకంగా ప్రహరీ ఉద్యానవనాలను ప్రారంభించారు. తొలివిడతలో ఆలయ మహాద్వారానికి ఇరువైపులా 2500 కుండీల్లో ఫోలియేట్ జాతి మొక్కలను పెంచుతున్నారు. ఈ మొక్కలకు ఆటోమేటిక్ డ్రిప్ విధానం ద్వారా నీటిని అందిస్తారు. రెండో విడతలో వైభవోత్సవం మండపం, సహస్ర దీపాలంకార సేవ మండపం వద్ద కూడా ఈ ఉద్యానవనాలను ఏర్పాటు చేయనున్నారు. కాగా, ఈప్రహరీ ఉద్యానవనాలను హైదరాబాదుకు చెందిన హర్ష బయోఫామ్ సంస్థ ఒక సంవత్సరం పాటు నిర్వహించనుంది. ఇందుకు రూ.30 లక్షలు వ్యయం కానుంది. హర్ష బయోఫామ్ సంస్థ భరించనుంది. సంస్థ ప్రతినిధులు టిటిడి ఉద్యానవన సిబ్బందికి శిక్షణ కూడా ఇవ్వనున్నారు.