రాష్ట్రీయం

గైర్హాజరైతే కఠిన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 9: వైద్యులు తమ సేవల ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని, పదే పదే విధులకు గైర్హాజరయ్యే వైద్యులపై కఠిన చర్యలు తప్పవని వైద్య ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైద్యుల బదిలీలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని గురువారం నాడు ఆయన హైదరాబాద్‌లో పాత్రికేయులతో మాట్లాడుతూ చెప్పారు. బదిలీల ప్రక్రియ శుక్రవారం నుండి 10 రోజుల పాటు కొనసాగుతుందని పేర్కొన్నారు. బదిలీలు పారదర్శకంగా జరిగేలా చర్యలు చేపట్టామని తెలిపారు. డాక్టర్ల పనితీరు, పరస్పర అంగీకారం, భార్యా భర్తలను ఒకే చోట లేదా వీలైనంత దగ్గరగా పనిచేసేలా ఎంసిఐ నిబంధనలకు లోబడి బదిలీ చేస్తామని అన్నారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఉచిత రోగ నిర్ధారణ పరీక్షలతో పాటు ఉచిత సిటి స్కాన్ పరీక్షలు, తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్, 108 సేవలు, 102 కాల్ సెంటర్, ఆస్పత్రుల్లో పరికరాల ఏర్పాటు మొదలైన పథకాల పనితీరు చాలా బాగుందని అన్నారు.
మహిళా దినోత్సవం సందర్భంగా 35 సంవత్సరాల వయస్సు నిండిన మహిళలకు అన్ని రకాల పరీక్షలు, క్యాన్సర్, డయాబెటిస్, హార్మోన్ పరీక్షలు, స్ర్తి వ్యాధులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఇప్పటికే 13వేల మంది ఎఎన్‌ఎంలకు దీనిపై శిక్షణతో పాటు ట్యాబ్స్ ఇచ్చామని అన్నారు. ఎపి వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో అత్యాధునిక నేత్ర పరీక్ష కోసం యంత్ర పరికరాలు ఏర్పాటు చేశామని, అన్ని జిల్లా ఏరియా ఆస్పత్రుల్లో బయోమెట్రిక్ హాజరు విధానం అమలుచేసిన తర్వాత హాజరు శాతం పెరిగిందని మంత్రి పేర్కొన్నారు. ఆస్పత్రుల్లో ప్రసవించిన మహిళలకు త్వరలో బేబీకిట్స్ ఇవ్వబోతున్నామని, దీనిపై ముఖ్యమంత్రితో చర్చించి త్వరలో ప్రారంభిస్తామని అన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లా ఆస్పత్రుల్లో ఒక్కో దానిలో 10 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి చెప్పారు. జిల్లాకు రెండు చొప్పున 13 జిల్లాల్లో హెల్త్ ఎటిఎమ్స్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అర్బన్ హెల్త్ సెంటర్స్ పనితీరు బాగోలేదని వీటిని ఈయుపిహెచ్‌సిలుగా మార్చి ఆధునికీకరిస్తామని వెల్లడించారు. 422 వైద్య పోస్టులను ఎపిపిఎస్‌సి ద్వారా భర్తీ చేస్తామని చెప్పారు.
త్వరలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో చదివే విద్యార్ధులకు ట్యాబ్స్ ఇస్తామని అన్నారు. కేంద్ర మంత్రులు రాష్ట్రంలో పర్యిటించినపుడు టిడిపికి అనుకూలంగా వ్యవహరించానని అనడం సరికాదని బిజెపి సభ్యుడిగా పార్టీలోని కార్యకర్తలు, నాయకులను కలుపుకుని వెళ్లడంతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు. మంత్రిగా తన శాఖను, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ పనిచేసే బాధ్యత తనపై ఉందని అన్నారు. కేంద్ర మంత్రులు సురేష్ ప్రభు, స్మృతి ఇరానీ విజ్ఞప్తి మేరకే ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశానని, అది కూడా ముందు ఎపి బిజెపి అధ్యక్షుడు హరిబాబును సంప్రదించాకనే నని చెప్పారు. ప్రత్యేక హోదాపై బిజెపి ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.