రాష్ట్రీయం

గవర్నర్‌తో చంద్రబాబు భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 11: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం రాత్రి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీ దాదాపు అర్ధగంటకు పైగా సాగింది. రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహనరావు కూడా చంద్రబాబు వెంట ఉన్నట్టు తెలిసింది. ఈనెల 27 నుండి ఎపి నూతన రాజధాని అమరావతిలోని వెలగపూడికి కార్యాలయాలను తరలిస్తున్న దృష్ట్యా ఆ అంశాలను, ఉద్యోగుల ఇబ్బందులు, వారి డిమాండ్లను కూడా గవర్నర్‌కు వివరించినట్టు తెలిసింది. తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులు, కేంద్రప్రభుత్వానికి ఇటీవల చేసిన ఫిర్యాదు, ఆంధ్రప్రదేశ్ వాదనతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో కాపు ఉద్యమం, ముద్రగడ చేపట్టిన దీక్ష, అనంతరం ప్రభుత్వం తీసుకున్న చర్యలను కూడా చంద్రబాబు గవర్నర్‌కు వివరించినట్టు తెలిసింది.