రాష్ట్రీయం

విద్యుదాఘాతానికి ఏనుగు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్నగొట్టిగల్లు, జూలై 4: విద్యుదాఘాతానికి గురై ఓ ఏనుగు మరణించిన సంఘటన చిత్తూరు జిల్లా ఎర్రవారిపాళ్యం మండలం, చింతగుంట పంచాయతీలో సోమవారం చోటుచేసుకుంది. మండలంలోని సుబ్బరామపురం వద్ద రైతు సిద్దయ్యకు చెందిన మామిడితోటలో 11 కెవి విద్యుత్ లైను మనిషి ఎత్తులో వేలాడుతుండడంతో ఆహారం కోసం వచ్చిన ఏనుగుల గుంపులో ఒకటి విద్యుత్ వైర్లు తగిలి విద్యుదాఘాతంతో మరణించింది. సంఘటన స్థలానికి అటవీ శాఖాధికారులు చేరుకుని మృతి చెందిన ఏనుగును పరిశీలించారు.